ఒక మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో రోబోలను రంగంలోకి దించారు ఫైర్ సేఫ్టీ అధికారులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
అగ్నిప్రమాద ఘటనల గురించి ఈమధ్య ఎక్కువగా వింటున్నాం. స్థానికంగా చూసుకుంటే ఇటీవల సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్లో జరిగిన ఘటనను చూశాం. ఇందులో ప్రమాద తీవ్రతకు ఏకంగా బిల్డింగ్ను అధికారులు కూల్చివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పురానాఫూల్లోనూ మరో అగ్నిప్రమాదం జరిగింది. నిర్లక్ష్యలేమి, ప్రమాదాన్ని ముందే పసిగట్టకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఫైర్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదిలాఉండగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఢిల్లీలోని సుల్తాన్పురిలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో రోబోలను కూడా ఉపయోగించామని, అవి చాలా సమర్థవంతంగా పనిచేశాయని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఏకే జైస్వాల్ చెప్పారు.
15 fire tenders present at the spot. The situation is under control. Robots are also being used to extinguish the fire. No casualties reported so far: AK Jaiswal, Divisional Fire Officer, Delhi pic.twitter.com/pjaBYeLc6Z
— ANI (@ANI) March 2, 2023