కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు ఎట్టకేలకు ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఆ కేసు నుంచి శశిథరూర్కు క్లీన్చిట్ లభించింది.
దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను వెంటాడుతున్న పీడకల నుంచి విముక్తుడిని అయ్యాను. ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న నాకు ఇప్పుడు ఉపశమనం లభించింది’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్లో శశిథరూర్ భార్య సునంద మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కొన్నాళ్లకు సునందా పుష్కర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మార్చారు. అయితే, శశిథరూర్ ప్రేరేపించడం వల్లే సునంద ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. వాటిని ఇవాళ ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి అదనపు పత్రాలను సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులను అనుమతించింది.
— Shashi Tharoor (@ShashiTharoor) August 18, 2021