కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు ఎట్టకేలకు ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఆ కేసు నుంచి శశిథరూర్కు క్లీన్చిట్ లభించింది. దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను వెంటాడుతున్న పీడకల నుంచి విముక్తుడిని అయ్యాను. ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న నాకు ఇప్పుడు ఉపశమనం లభించింది’ అని […]