టీమిండియాలో సంజూ శాంసన్ కు ఎందుకు ప్లేస్ ఇవ్వట్లేదు? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న ఇష్యూ. తాజాగా జరిగిన న్యూజిలాండ్ తో మూడో వన్డేలో శాంసన్ ని కాదని పంత్ కు అవకాశమిచ్చారు. అతడు ఎప్పటిలానే నిరాశపరిచాడు. దీంతో క్రికెట్ లవర్స్ రెచ్చిపోతున్నారు. సంజూకు అన్యాయం చేస్తున్నారని తెగ బాధపడిపోతున్నారు. సంజూకి మద్దతుగా వేలకొద్ది పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీమిండియా మేనేజ్ మెంట్ తీరుపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఇవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ బాగానే ఆడుతున్నప్పటికీ.. ఆ స్థాయిలో ఛాన్సులు రావడం లేదు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. కానీ ఒక్కసారి మినహా అసలు జట్టులో ఆడే ఛాన్సే ఇవ్వలేదు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో 36 పరుగులు చేసిన శాంసన్ ను రెండో మ్యాచ్ కు వచ్చేసరికి పక్కనపెట్టేశారు. ఇక మూడో వన్డేలోనూ తుదిజట్టులోకి తీసుకోలేదు. అతడి స్థానంలో పంత్ ని తీసుకున్నారు. కానీ మనోడు మాత్రం.. మరీ ఘోరంగా ఆడాడు. 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి నిర్లక్ష్యంగా ఔటయ్యాడు. ఇక ఇది కాదన్నట్లు భారత హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన వివరణ.. సోషల్ మీడియాలో రచ్చకు మరింత కారణమైంది. ఇప్పుడు ఇదే విషయం ఎంపీ శశిథరూర్ కూడా ఫైరయ్యారు.
‘పంత్ 4వ స్థానంలో బాగా ఆడగలడు. అందుకే అతడిని తీసుకున్నాం’ అని కోచ్ లక్ష్మణ్ చెప్పాడు. అయితే పంత్ ఫామ్ లో లేని ఆటగాడు. గత 11 ఇన్నింగ్సుల్లో పదింటిలో ఫెయిలయ్యాడు. అదే టైంలో సంజూ బ్యాటింగ్ ఎవరేజ్ 66 ఉంది. గత ఐదు మ్యాచుల్లోనూ మంచి స్కోర్లే చేశాడు. కానీ సంజూని బెంచ్ పై కూర్చోబెట్టి, పంత్ కి ఛాన్సులిస్తున్నారు. దీనిపై స్పందించిన శశిథరూర్.. ‘పంత్ నుంచి మరో వైఫల్యం. వైట్ బాల్ క్రికెట్ నుంచి అతడికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరముంది. అదే టైంలో సంజూకి మరో ఛాన్స్ ఇవ్వలేదు. తాను గుడ్ బ్యాటర్ అని ప్రూవ్ చేసుకునేందుకు ఐపీఎల్ కోసం సంజూ వెయిట్ చేస్తున్నాడు’ అని అన్నారు.
One more failure for Pant, who clearly needs a break from white-ball cricket. One more opportunity denied to @IamSanjuSamson who now has to wait for the @IPL to show that he’s one of the best too-order bats in India. #IndvsNZ https://t.co/RpJKkDdp5n
— Shashi Tharoor (@ShashiTharoor) November 30, 2022