ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012 లో వివాహం జరిగింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇక 2020 లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ.. ఎవరి దారి వారు చూసుకున్నారు. బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ ధావన్ కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన న్యాయ స్థానాల్లో కల్లోలిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న భార్యపై భర్త యాసిడ్ దాడి చేసిన సంగతి విదితమే. తాజాగా మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని ఓకోర్టు ఆవరణలో కాల్పులు కలకలం రేపాయి.
Telegram: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు కొంతమంది దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉంటారు. అయితే, సినిమా హాల్లో కాదు.. ఏదైనా పైరేట్ సినిమా వెబ్సైట్లలో చూడ్డానికి. ప్రస్తుత కాలంలో దొంగ సినిమాలు చూడటానికి ఎక్కువ మంది నెటిజన్లు టెలీగ్రామ్ను వాడుతున్నారు. అందులో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వారి పాలిట సమస్యగా మారనుందని సమాచారం. దొంగతనంగా సినిమాలు విడుదల చేయ్యటమే కాదు.. చూడటం కూడా నేరమే. అది కాపీ రైట్ వాయిలేషన్ […]
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు ఎట్టకేలకు ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఆ కేసు నుంచి శశిథరూర్కు క్లీన్చిట్ లభించింది. దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను వెంటాడుతున్న పీడకల నుంచి విముక్తుడిని అయ్యాను. ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న నాకు ఇప్పుడు ఉపశమనం లభించింది’ అని […]