విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు కచ్చితంగా కరోనా కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని దాదాపు అన్ని దేశాలూ నిబంధనలు విధించాయి. ఈ క్రమంలో ఈ టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్కు జత చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేయడం ఊరటనిచ్చే అంశం. విదేశీ ప్రయాణానికి వెళ్లే వారు 72 నుంచి 96 గంటలలోపు RT-PCR టెస్ట్ చేయించుకోవాలన్నది నిబంధన. అయినా ఇలా కొవిన్ యాప్ను వ్యాక్సిన్ పాస్పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్న. అయితే దీనిపై వివిధ దేశాలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల సదరు వ్యక్తి భారత ప్రభుత్వం ఆమోదించిన కరోనా టెస్టు చేయించుకున్నట్లు స్పష్టం అవుతుంది. ICMRతో కలిసి దీనిని అమలు చేయనున్నారు.
భారతదేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న కారణంగా భారతదేశం నుంచి మా దేశానికి రావద్దు అని ఆంక్షలు విధించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రభంజనం తీవ్రంగా ఉండడంతో చాలా దేశాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపధ్యంలో ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా థర్డ్ వేవ్ డేంజర్గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కేసులు కూడా భారీగా పెరుగుతాయని అంటున్నారు. కేవలం ప్రభత్వాలే కాదు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అప్రమత్తంగా ఉండి తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మాత్రమే థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా బారినపడి కోలుకుంటే యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి, తమకేమీ కాదనుకుంటున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్నా డేంజర్ తప్పదని హెచ్చరిస్తున్నారు.
సెకండ్ వేవ్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న చోట్లలో ఈసారి కేసులు పెరగొచ్చు. అలాగే అధిక సంక్రమణ రేటు ఉన్న జిల్లాల్లో ఈ సారి కేసులు ఆ స్థాయిలో ఉండవని బావిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు కొవిన్ యాప్ ఎంతో సహకరిస్తుందని అంతా భావిస్తున్నారు.