దేశంలో కరోనా వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. కరోనా నియంత్రణలో ఉండగా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన […]
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు కచ్చితంగా కరోనా కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని దాదాపు అన్ని దేశాలూ నిబంధనలు విధించాయి. ఈ క్రమంలో ఈ టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్కు జత చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేయడం ఊరటనిచ్చే అంశం. విదేశీ ప్రయాణానికి వెళ్లే వారు 72 నుంచి 96 గంటలలోపు RT-PCR టెస్ట్ చేయించుకోవాలన్నది నిబంధన. అయినా ఇలా కొవిన్ యాప్ను వ్యాక్సిన్ పాస్పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్న. అయితే దీనిపై వివిధ […]
ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల సామాజిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. వారిలో అలసత్వమూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో ప్రయాణాలు, పండుగల సమయంలో గుమిగూడటాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో ఉద్ధృతి మొదలైంది. రెండో ఉద్ధృతి వల్ల దేశ ప్రజల్లో సహజసిద్ధ రోగ నిరోధక శక్తి భారీగా పెరిగింది. ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గత […]
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండింటిలో ఏ వ్యాక్సిన్ను తీసుకున్నా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే లక్నోలో ఓ వ్యక్తి కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై ప్రతాప్ చంద్ర ఫిర్యాదు చేశాడు. తాను కోవిషీల్డ్ డోసును తీసుకున్నప్పటికీ తనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిపాడు. సీరమ్ సంస్థతోపాటు మరికొందరిపై అతను ఫిర్యాదు చేశాడు. లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీరమ్ సంస్థతోపాటు డీసీజీఏ డైరెక్టర్, […]
కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి […]
రోజురోజుకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రజలు ప్రస్తుతం సెకండ్ తో చెప్పుకోలేని బాధలో పడిపోతున్నారు. ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం., మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ […]