ఈరోజుల్లో లంచం తీసుకొని రాజకీయ నాయకుడు ఉన్నాడా! అంటే నమ్మశక్యం కాని విషయం. నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి అని ప్రజలలో ఏనాడో నాటుకుపోయింది. కానీ, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తనకు ఒక వ్యక్తి లంచం ఇవ్వజూపారంటూ.. ఆ నోట్ల కట్టలతోనే అసెంబ్లీకి హాజరయ్యాడు. అసెంబ్లీ వేదికగా ప్రసంగిస్తూనే నోట్ల కట్టలను తీసి బయటపెట్టాడు. ఈ ఘటన ఢిల్లీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేందర్ గోయల్ కు సిటీ గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ లంచం ఇవ్వబోయారట. ఆ డబ్బులను తీసుకున్న ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆ నోట్ల కట్టలను బయటపెట్టాడు. తనకు లంచం ఇవ్వజూపారంటూ నోట్ల కట్టలు తీసి సభలో అందరికి చూపించారు. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రిలో తాత్కాలిక స్టాఫ్ నియామకాల్లో అవకతకలు చోటుచేసుకున్నట్టు ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే, తన ప్రాణలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి బెదరింపులకు తాను భయపడేది లేదని చెప్పుకొచ్చారు.
#Watch | #AAP MLA, Mahender Goyal, caused a stir today in the #Delhi Assembly by displaying large sums of cash there and alleging that a private contractor at a city government hospital tried to bribe him.@NewIndianXpress @santwana99 pic.twitter.com/WNXMCf28lf
— TheMorningStandard (@TheMornStandard) January 18, 2023
”లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన సదరు కాంట్రాక్టరుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే నాకు రక్షణ కల్పించాలి. నా జీవితం ప్రమాదంలో పడింది..” అని సభావేదికగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తెసుకోవాల్సిన అవసరముందని తెలిపిన స్పీకర్, మంత్రి ఫిర్యాదును పిటీషన్స్ కమిటీ ఆఫ్ హౌస్కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లంచం డబ్బులను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన ఈయనను సమర్ధించాలా..? ఈయన ఎన్నికల్లో డబ్బు పంచకుండానే అధికారంలోకి వచ్చారంటారా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.