భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా నెలకొంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. భారత్ లో 1270 కి ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. 374 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజాగా భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయ్యింది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందాడు. 52 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడికి గుండెపోటు రావడంతో చనిపోయాడు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కాగా, యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
ఇది చదవండి : ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన.. 4 జిల్లాలకు అలర్ట్
బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. చనిపోయిన యశ్వంత్ రావు చవాన్ 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నాడు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగా పరిగణించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో అతనికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలడం యాదృచ్ఛికమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ పేర్కొంది. దీంతో భారత్ ఒమిక్రాన్ కేసుల విషయంలో మరింత అలర్ట్ అయ్యింది.