ఉన్నపళంగా కోటీశ్వరులు కావడం అంటే కల్లే. ఒకటి నిధులైనా దొరకాలి లేదంటే లాటరీ అయినా తగలాలి. ఈ రోజుల్లో నిధి దొరికిందనుకోండి ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేయాల్సిందే. అదే లాటరీ అయితే కొంత టాక్సుల రూపంలో కట్ అయ్యి మిగతాది మనకు దక్కుతుంది. అందుకే కొంత మంది లాటరీ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి లాటరీ కొని...
జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లుగా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు కొందరు. అయితే ఉన్నపళంగా కోటీశ్వరులు కావడం అంటే కల్లే. ఒకటి నిధులైనా దొరకాలి లేదంటే లాటరీ అయినా తగలాలి. ఈ రోజుల్లో నిధి దొరికిందనుకోండి ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేయాల్సిందే. అదే లాటరీ అయితే కొంత టాక్సుల రూపంలో కట్ అయ్యి మిగతాది మనకు దక్కుతుంది. అందుకే కొంత మంది లాటరీ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. ఒకసారి కాకపోతే మరోసారి అయినా అదృష్టం తలుపు తట్టకపోతుందా అని ఎదురు చూస్తూ.. లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ సామాన్యుడు తన లక్ ను పరీక్షించుకున్నాడు. అనుకోకుండా జాక్ పాట్ కొట్టాడు. ఆ ఆనందం ఎంత సేపు మిగల్లేదు. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం.
పంజాబ్ నగరం ఫజిల్క్ జిల్లాకు చెందిన సాక్ష్ అనే యువకుడు.. ఓ లాటరీ కొనుగోలు చేసి.. అందులో తన పేరు మాత్రమే రాశాడు. అయితే అనుకోకుండా అతడి టికెట్కు రూ. 2.50 కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలింది. అతడెవరో కానీ లక్కీ అనుకున్నారు. అయితే అది అతడికి అందించలేని పరిస్థితి. ఎందుకంటే సాక్ష్ కేవలం పేరు మాత్రమే రాసి, అడ్రస్, ఇతర వివరాలు పూర్తి చేయలేదు. అతనికి వచ్చిన డబ్బును ఇవ్వడానికి ఆ లాటరీ దుకాణం వాళ్లు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ సరైన వివరాలు లేక సంప్రదించలేకపోతున్నారు. అతడి జాడ కానరాకపోతే అది చివరికి ప్రభుత్వ ఖజానాలోకి చేరే అవకాశం ఉంది. ఇది తెలిసిన ప్రజలు.. ఒకింత బాధను, తమకు రాలేదన్నఅక్కసును వెళ్లగక్కుతున్నారు.
లాటరీ కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా వ్యక్తి పేరుతో సహా, ఇంటి చిరునామా లేదంటే ఫోన్ నంబర్ వివరాలు రాయాల్సి ఉంటుందని, ఇవన్నీ రాయకుండా కేవలం పేరు మాత్రమే రాస్తే.. విజేత గెలిచిన సొమ్ము పొందే అవకాశం ఉండదని లాటరీ దుకాణాదారుడు బాజీ బవేజా చెబుతున్నారు. అతడు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల అతనికి వచ్చిన డబ్బుమెుత్తం అక్కడున్న ప్రభుత్వానికి వెళ్లిపోతుందని చెబుతున్నారు. పేరు ఒక్కటే రాయడం వల్ల సాక్ష్ అనే వ్యక్తిని గుర్తించడం సాధ్యం కాదని.. అయినా అతని జాడ కోసం వెతుకుతున్నామని ఆ దుకాణదారుడు అన్నారు. మెుత్తానికి లాటరీ దుకాణదారుడు 249092 టికెట్ నంబర్ కలిగిన వ్యక్తిగా గెలుచుకున్న ఫ్రైజ్ మనిని క్లెయిమ్ చేసుకునేందుకు రూప్ చంద్ కంపెనినీ సంప్రదించాలని లాటరీ టికెట్ తీసుకునే వాళ్లకు బాబీ ప్రజలకు విన్నపం చేశారు. ఇప్పటి నుంచి ఎవరికైని సరే లాటరీనీ తీసుకునేటప్పుడు కనీసం పేరు, ఫోన్ నంబరైనా రాయాలని సూచించారు.