రాఖీ పండుగ అనేది అన్నాచెల్లి అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఓ వేడుక. ఈ రక్షాబంధన్ పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీ కడుతున్నారు. ఈ రక్షా బంధన్ సందర్బంగా ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర కూడా బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సిబ్బంది కుమార్తెలు రాఖీలు కట్టారు. ప్రధానమంత్రి ఇంటి వద్ద జరిగిన ఈ ప్రత్యేక రక్షబంధన్ వేడుకలో పాల్గొన్న వారిలో మోదీ వద్ద పనిచేసే స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి , డ్రైవర్ల కూతుళ్లు ఉన్నారు.
రాఖీ కట్టిన ఆ చిన్నారులతో మోద ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారులతో జరుపుకున్న రక్షాబంధన్ తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఆ పిల్లలతో ప్రధాని మోదీ చాలా సమయంలో సరదాగా గడిపారు.ఈ కార్యక్రమం కంటే ముందు రాఖీ పండుగా సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరి.. తన సిబ్బంది కూతుళ్లతో ప్రధాని మోదీ రక్షాబంధన్ జరుపుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
ఇదీ చదవండి: రాఖీకి తమ్ముడికి కొత్త జీవితం బహుమతిగా.. కిడ్నీ ఇచ్చి అనురాగం చాటుకున్న అక్క!
ఇదీ చదవండి: రాఖీ పండగపూట దారుణం.. చెల్లెలిపై సొంత అన్న అత్యాచారం!