మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. రాఖీ పండగపూటే ఓ సొంత అన్న చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని భరించలేని ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఔరంగాబాద్ వైజాపూర్ పరిధిలోని విర్ గావ్. ఇదే ప్రాంతంలో తల్లితో పాటు ఆమె కూతురు, కొడుకు నివాసం ఉంటున్నారు. అయితే తోడబుట్టిన చెల్లిని కంటికి రెప్పలా కాపాల్సిన అన్న తన పాడుబుద్దిని చూపించాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడుతూ.. చాలా రోజుల నుంచి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా సరే ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లికి చెప్పింది. తల్లికి చెప్పినా ఎలాంటి ఫలితం లేకుండపోయింది. దీంతో మరింత కృంగిపోయిన ఆ యువతికి ఏం చేయాలో అర్థంకాక తనలో తాను కుమిలిపోయింది. అలా కొంత కాలంపాటు ఆ దుర్మార్గుడు రెచ్చిపోయి చెల్లిపై అదే పనికిగా అత్యాచారం చేయడంతో చివరికి ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తల్లికి తెలిసింది. బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ దారుణాన్ని మాత్రం కూతురు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. రాఖీ పండగపూట ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులను కలిచివేసింది. చూశారు కదా.. సొంత అన్నే చెల్లిలిపై అత్యాచారానికి పాల్పడి, చెల్లెలి మరణానికి కారణమైన ఈ ఘటనలో దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: రాత్రికి నాతో వస్తే.. నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా!