ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలు పోయినా.. తమకు డబ్బు వస్తుందంటే దేనికైనా సిద్దపడుతున్నారు.
డబ్బు కోసం ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఎన్ని దారుణాలకైనా తెగబడుతున్నారు. అమాయకులను మాయమాటలు చెప్పి దారుణంగా మోసం చేస్తున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ లగ్జరీ జీవితాలు గడుపుతున్నారు. ఈ మద్య కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. చదువు పేరుతో ఓ కేటుగాడు గ్రామాల్లో ఉన్న చిన్నారులను పట్టణానికి తీసుకు వచ్చి వారిచే గొడ్డు చారికీ చేయించిన ఘటన బీహార్ లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నేటి సమాజంలో చదువుకు ఎంతో విలువ ఉంది. మంచి చదువులు చదివితే గొప్ప ఉద్యోగాలు వస్తాయని అంటారు. అందుకే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడైనా సరే పిల్లలకు మంచి చదువు చెప్పించాలని చూస్తారు. అలాంటిది మంచి చదువు చెప్పించి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి చిన్నారులను తీసుకు వచ్చి వారిచే వెట్టి చాకిరి చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్న ఓ కేటుగాడి నిర్వాకం బయటపడింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుడ్డు అనే వ్యక్తి భట్టా భస్తీ ప్రాంతంలో గాజుల ఫ్యాక్టీ నడిపిస్తున్నాడు. ఫ్యాక్టీరీలో పనిచేయడానికి వర్కర్లు కావాల్సి ఉంది.. అయితే పెద్దవారికి ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది.. బీహార్ కి చెందిన కొంతమంది పేద తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వారి పిల్లలను పనికి కుదుర్చుకున్నాడు. మంచి చదువు చదివించి.. భవిష్యత్ లో గొప్ప ఉద్యోగస్తులను చేసే బాధ్యత తనదే అని తల్లిదండ్రలకు చెప్పాడు.
గుడ్డు చెప్పిన మాయమాటలు నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలను అతని వెంట పంపారు. పిల్లలను తన యూనిట్ కి తీసుకు వచ్చి వారికి చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి దాదాపు 18 గంటల పాటు గాజులు తయారీ చేయిస్తుండేవాడు. కొంతమంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై పనిచేయకుంటే వారిని శారీరకంగా హింసించి మరీ పనులు చేయించేవాడని బాధితులు చెబుతున్నారు. స్థానికులు ఇది గమనించి రాజస్థాన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, నయ సవేరా అనే ఎన్జీవో సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు గాజుల పరిశ్రమకు వచ్చి చూడగా అక్కడ 26 మంది ఉన్నారు. 22 మంది మైనర్లే.. వారిలో ఏడేళ్ల నుంచి 11 లోపు వయసు ఉన్నవాళ్లు కావడం గమనార్హం. వెల్ఫేర్ కమిటీ సభ్యులు వస్తున్నారని తెలుసుకున్న గుడ్డు అక్కడ నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు అతడిని గాలిస్తున్నారు.