కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటి ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని పరిచయం చేయనుంది. దీని ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా సెటాప్ బాక్సులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి బుధవారం కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా దూరదర్శన్, ఆలిండియా రేడియో అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం కేంద్రం బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ వర్క్ డెవలప్మెంట్(బీఐఎన్ఐ) అనే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.2,539.61 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ పథకం కింద కేంద్రం పల్లె, మన్యం, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి 8 లక్షల డీడీ సెటాప్ బాక్సులను ఉచితంగా ఇవ్వనున్నారు. అలాగే ఈ పథకంలో ప్రసార భారతి, దూరదర్శన్ బ్రాడ్ కాస్టింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్ విషయంలో సహాయం చేయనున్నారు.
ఈ పథకంలో ఉచితంగా సెటాప్ బాక్సులు అందించడం, ఆలిండియా రేడియో, దూరదర్శన్ ను అభివృద్ధి చేయడమే కాదు.. పరోక్షంగా ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బ్రాడ్ కాస్టింగ్ కి సంబంధించిన వస్తువుల తయారీ, సెటాప్ బాక్సులను ఇన్ స్టాల్ చేసే రూపంలో ఉపాధి అవకశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఇప్పటివరకు దూరదర్శన్ 36 ఛానళ్లను ప్రసారం చేస్తోంది. వాటిలో 28 రీజనల్ ఛానల్స్ ఉన్నాయి. మరోవైపు ఆలిండియా రేడియోకి 500 ప్రసార కేంద్రాలు ఉన్నాయి. ఈ స్కీమ్ ద్వారా దూరదర్శన్, ఆలిండియా రేడియో అభివృద్ధి, రీచ్ బాగా పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Union Cabinet approved the Broadcasting Infrastructure & Network Development (BIND) Scheme.
• ₹2,539.61 crore outlay to financially support @prasarbharati
•This will be utilised for expansion & upgradation of its broadcasting infra, content development and civil work.
1/n
— Anurag Thakur (@ianuragthakur) January 4, 2023