వందేళ్ల క్రితం అపహరణకు గురైన అన్నపూర్ణా దేవి విగ్రహం అధికారికంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కెనడా నుంచి భారత్ చేరుకున్న అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి యూపీకి అప్పగించారు. నాలుగు రోజుల పాటు శోభాయాత్ర తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహాన్ని కాశీలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, మీనాక్షీ లేఖి పాల్గొన్నారు. ప్రత్యేక రథంలో అమ్మవారి విగ్రహాన్ని ఢిల్లీ నుంచి అలీగఢ్ తీసుకెళ్లారు. నవంబరు 12న కనౌజ్ నుంచి అయోధ్యకు శోభాయాత్రగా తీసుకెళ్లనున్నారు. నవంబరు 15న వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ చేతుల మీదుగా ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని ఇండియా తీసుకురానున్నట్లు గతేడాది నవంబర్లో ‘మన్ కీ బాత్’లో ప్రధాని వెల్లడించిన విషయం తెలిసిందే.
A day to cherish the Civilisational & Cultural Glory of Bharat!
Under the relentless pursuit of the @NarendraModi Govt, #BringingOurGodsHome continues & this morning, joined by several Union Ministers, puja was performed to Annapurna Devi Murti retrieved from 🇨🇦 at @ngma_delhi. pic.twitter.com/eSqD2AAXv1
— G Kishan Reddy (@kishanreddybjp) November 11, 2021
కాశీ అన్నపూర్ణా దేవి సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసినట్లు హిందువులు నమ్ముతారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ విగ్రహం భారత్లో అపహరణకు గురైంది. ఈ విగ్రహం ఇప్పటి వరకు కెనడాలోని మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో వారసత్వ సంపదగా ఉంది. 1913లో మెకంజీ భారత్లో పర్యటించిన సందర్భంగా అన్న పూర్ణమ్మ విగ్రహం చూశారని.. ఆయన కోరిక మేరకు గుర్తుతెలియని వ్యక్తి ఆ విగ్రహాన్ని అపహరించి మెకంజీకి అప్పగించినట్లు అక్కడి రికార్డుల్లో ఉంది. 2019లో దివ్య మెహ్రా అనే ఆర్టిస్టు మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో తన ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో ఉండగా ఈ విగ్రహాన్ని గమనించాడు. రికార్డులు తిరగేసి ఈ విగ్రహాన్ని భారత్కు అందజేయాలంటూ మెంకజీ ఆర్ట్ గ్యాలరీ సీఈవోని కోరాడు. భారత దౌత్యకార్యాలయం వారు కూడా కెనడా ప్రభుత్వంతో చర్చించగా వారు ఈ విగ్రహాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు.
This Murti will be taken in a procession to Kashi Vishwanath Temple where the Pranaprathista will be performed, thereby reinstating the spiritual & divine grace of Maa Annapurna Devi.
Blessed to have the Murti brought back to her rightful place.#BringingOurGodsHome pic.twitter.com/iafRQ8iPzY— G Kishan Reddy (@kishanreddybjp) November 11, 2021