ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారులు సైతం గుండెపోటు కారణంగా మృతి చెందడం కలవర పెడుతోంది. ఇక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి సభ్యులు ఒకరు గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆ వివరాలు..
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచంలోని అనేక చారిత్రాత్మకంగా ప్రదేశాలను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో పలు ప్రాంతాలను యునెస్కో.. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన గుజరాత్ లోని వాద్ నగర్.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. ఇదే విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక గుజరాత్ లోని […]
అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 వంటి విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ కాలంలో మెస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ గా అభిషేక్ అగర్వాల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ-2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలతో మంచి లాభాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ మరోసారి మంచి మనస్సు చాటుకున్నాడు. కరోనా సమయంలో […]
ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కోనుగోలు కుట్ర సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజుల నుంచి ఈ ఇష్యూ ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం అధికార టీఆర్ఎస్ , ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడను రాజేసింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనలో ఓ ఆడియో బయటకొచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర […]
అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మెల్ల మెల్లగా అగ్నిపథ్ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. ఇక భారీగా పోలీసులు మోహరిండంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ధీటుగా స్పందించిన పోలీసులు నిరసనకారులపై కాల్పులకు దిగారు. ఈ […]
వందేళ్ల క్రితం అపహరణకు గురైన అన్నపూర్ణా దేవి విగ్రహం అధికారికంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కెనడా నుంచి భారత్ చేరుకున్న అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి యూపీకి అప్పగించారు. నాలుగు రోజుల పాటు శోభాయాత్ర తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహాన్ని కాశీలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, మీనాక్షీ లేఖి పాల్గొన్నారు. ప్రత్యేక రథంలో అమ్మవారి విగ్రహాన్ని ఢిల్లీ నుంచి అలీగఢ్ తీసుకెళ్లారు. నవంబరు 12న కనౌజ్ […]