21వ శతాబ్దంలో కూడా ఇంకా మూఢ నమ్మకాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. బాధితుల బలహీనతను ఆసరాగా చేసుకుని నకిలీ బాబాలు వారిని శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్న సంఘటనలు మన దేశంలో చాలా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వాటిని చూసి ఇంకా మారడం లేదంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. తాజాగా ఓ నకిలీ బాబా తనపై ఐదు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బెంగళూర్ కు సమీపంలోని ఆవలహళ్లి అనే ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబంలోని యువతికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదు. దాంతో వారు స్థానికంగా ఉండే బాబా ఆనందమూర్తిని కలిశారు. అతడు వారికి పూజలు చేయడం ప్రారంభించాడు. అతడు పూజలు చేసే క్రమంలో ఇచ్చే పానీయాలలో మత్తు మందు కలిపి పలు మార్లు ఆ యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అదీ కాక ఆనందమూర్తి తన భార్య లతతో ఫోన్ లో అత్యాచార వీడియోలను తీయించి ఆ యువతిని బెదిరిస్తూ పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తూన్నాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చే పెళ్లి సంబంధాలను సైతం వారు ఇద్దరు కలిసి చెడగొడుతున్నారని తన లాయర్ జ్ఞానేష్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తన ఫామిలీ నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని వాపోయింది.
ఇక ఈ విషయాలు ఎవరికైన చెబితే ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పెడతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అదీకాక కొన్ని రోజుల్లో ఒక అబ్బయితో నాకు నిశ్చితార్థం జరగనుండగా ఆనందమూర్తి తనను అతడితోనే ఉండాలని, నువ్వు నా లక్కీ బేబి అంటూ మాట్లాడినట్టు ఆమె తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. మరి ఈ కాలంలో కూడా బాబాలను నమ్మి మోస పోయేవారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.