Car: చెన్నై రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పైపులైను కోసం రోడ్డుపై తవ్విన గోతి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకపోవటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. నేరుగా వచ్చి ఆ గోతిలో పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ రోడ్డుపై పైపు లైను కోసం ప్రభుత్వ అధికారులు ఓ పెద్ద గొయ్యి తవ్వారు. అయితే, గోతి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకుండా అలాగే వదిలేశారు. ఈ నేపథ్యంలో ఓ కారు ఆ రోడ్డుపై వెళుతూ గోతిలో పడింది. ఈ ఘటనలో కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం దీన్ని కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. డ్రైవర్ తాగి బండి నడపటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వాదిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ సమీపంలో చోటుచేసుకుంది. గిండి ఫ్లైఓవర్పై రోడ్డు పనుల కోసం గొయ్యి తవ్విన అధికారులు దాన్ని పూడ్చటంలో ఆలస్యం చేశారు.
చూట్టూ రక్షణ బ్యారికేడ్లు పెట్టి వదిలేశారు. ఈ నేపథ్యంలో ధనేశ్వరన్ అనే వ్యక్తి కారులో వెళుతూ ఆ గోతిలో పడిపోయాడు. దీంతో ధనేశ్వరన్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు, తోటి వాహనాదారులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మరి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెన్నై రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Uttar Pradesh: వలస కూలీ వ్యధ.. 40 ఏళ్లుగా ఇసుకే ఆహారం!