వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది ట్రాఫిక్ చలాన్స్. ఏదో ఒక సమయంలో తెలియక చేసిన తప్పు కారణంగా ట్రాఫిక్ చలాన్ పడటం, అలా అలా ఆ బిల్స్ పెరిగిపోయి, వాహనదారుడికి భారంగా మారడం సర్వ సాధారణమై పోయింది.
వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది ట్రాఫిక్ చలాన్స్. ఏదో ఒక సమయంలో తెలియక చేసిన తప్పు కారణంగా ట్రాఫిక్ చలాన్ పడటం, అలా అలా ఆ బిల్స్ పెరిగిపోయి, వాహనదారుడికి భారంగా మారడం సర్వ సాధారణమై పోయింది. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ చలాన్లు బండి విలువ కూడా దాటి పోవడంతో.. ఆ వాహనాలను రోడ్డుపై వదిలి వెళ్ళిపోయిన ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. గత 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తూ ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో.. వాహదారులు యోగీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాల్లోకి వెల్తే..
5 ఏళ్లలో యూపీలోని అన్నీ జిల్లాలలో నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా పాస్ కావడం విశేషం. అయితే.. ఈ 5 ఏళ్ళకి ఓ నిర్దిష్ట కాలాన్ని ప్రకటించారు. 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు ఏ వాహనాలపై చాలాన్స్ పెండింగ్ ఉన్నాయో.. అవన్నీ రద్దు కానున్నాయి. ఈ కాలంలో చలాన్లు నమోదై.. కోర్టులో కేసులు ఉన్న వాహనాలపై కూడా చాలాన్స్ రద్దు కానున్నాయి. ఈ మేరకు యూపీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కోర్టుల నుంచి కేసుల జాబితా రాగానే పోర్టల్ నుండి చలాన్స్ తొలగించనున్నారు. యోగీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కమర్షియల్ వాహనదారులకు ఎక్కువ లాభం కలగనుంది. ఈ క్రమంలో వాహనంపై ఉన్న చలాన్లు అన్నీ రద్దు అయ్యాక.. ఆ వాహనదారుల ఫోన్ నంబర్స్ కి మెసేజ్ రానుంది. ఇటీవల నోయిడాలోని రైతులు అంతా ఈ ట్రాఫిక్ చలాన్స్ రద్దు చేయాలని రోడ్లపైకి రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి.. యోగీ ప్రభుతం 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.