లైంగిక నేరాలకు సంబంధించి బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. పెదాలపై ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం.. భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ కింద అసహజ లైంగిక నేరాలు కావనిపేర్కొంటూ ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఓ 14 ఏళ్ల బాలుడికి నిందితుడు ముద్దు పెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాగడం అనేది కేసులో ప్రధాన అభియోగం. ఈ కేసులో నిందితుడు యేడాదిగా జైల్లో ఉండటం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకు చెందిన ఓ వ్యక్తి బీరువాలో దాచిన డబ్బులు తరచూ మాయం అవుతుండటంతో తన 14 యేళ్ల కుమారుడిని అవమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే నిజం చెప్పాడు. ఆ డబ్బులు తానే తీసి ఆన్ లైన్ గేమ్స్ కోసం రీచార్జ్ చేసుకున్నట్టు తెలిపారు. అయితే, ఇక్కడే అసలు విషయాన్ని ఆ బాలుడు బయటపెట్టాడు. రీచార్జ్ కోసం షాపుకు వెళ్ళగా, ఆ షాపు యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టడం, ప్రైవేటు భాగాలు తడుముతున్నాడని చెప్పాడు. దీంతో బాలుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అరెస్టు చేశారు. ఫలితంగా యేడాది కాలంగా జైల్లో మగ్గుతూ వచ్చాడు.
ఇది కూడా చదవండి: Chennai: ఇంటర్ చదివే కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి!
ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని విచారించిన హైకోర్టు.. నిందితుడు బాలుడు పెదాలపై ముద్దులు పెట్టాడని, ప్రైవేట్ భాగాలు తాకాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని, అయితే, సెక్షన్ 377లో పేర్కొన్న అసహజ లైంగిక నేరాల కిందకి ఇవి రావని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. సాధారణంగా 377 సెక్షన్ కింద బెయిల్ లభించడం అంత సులభతరమైన విషయం కాదు. పైగా, జీవిత జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉంది. దేశంలో లైంగిక ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి తీర్పు రావడం మరింత చర్చకు దారితీసేలా ఉంది.. ఏదేమైనా.. హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.