వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కంగానాకు ఈ సారి ఊహించని పరిణామం ఎదురైంది. తన వ్యాఖ్యలకు బీజేపీయేతర నాయకులు మాత్రమే కౌంటర్ ఇచ్చేవారు. కానీ ‘‘1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’’ అంటూ మోదీ ప్రధాని అవ్వటాన్ని ఉద్దేశిస్తూ కంగనా చేసిన కామెంట్పై బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ మండిపడ్డారు. కంగనా నరేంద్ర మోదీని పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ కావటం సొషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.
‘‘కొన్నిసార్లు.. మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం, మరికొన్ని సార్లు ఆయన హంతకుడ్ని కీర్తించటం.. మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని సైతం చులకన చేయటం! దీన్ని ఏమనాలి… పిచ్చా? లేక దేశ ద్రోహమా?’’ అంటూ ట్విట్టర్లో కంగనాని విమర్శించారు వరుణ్ గాంధీ. కంగనా ఏం మాట్లాడినా కూడా బీజేపీ వాళ్లు స్పందించేవారు కాదు. ఆమె బీజేపీకి సపోర్ట్గా ఉన్నారనే భావన వారిలో ఉంది. ఇతర పార్టీ నాయకులపై కామెంట్లు చేసే కంగనా.. ఏనాడూ బీజేపీ నేతలపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇప్పుడు బీజేపీ ఎంపీనే ఆమెను తప్పుపట్టారు. మరి ఈ విషయంపై కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి. కంగాన్ వ్యాఖ్యలు.. దానికి వరణ్ గాంధీ కౌంటర్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021