ఈ మద్య ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చాలా సమయం పడుతుంది.. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుందని అంటుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు లేనిదే పనిచేయని దుస్థితి ఏర్పడిందని ఎంతో మంది బాధితులు చెబుతుంటారు. కొన్నిసార్లు లంచావతారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో అధికారి రైతు వద్ద లంచం డిమాండ్ చేయడంతో ఎంపీ కలుగజేసుకొని సదరు అధికారి చెంప చెల్లుమనిపించాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతాప్ ఘడ్ కి చెందిన బీజేపీ ఎంపీ చంద్ర ప్రకాశ్ జోషీ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఓ రైతు ఎంపీ వద్దకు వచ్చి తన ఆవేదన చెప్పుకున్నాడు. గత కొంత కాలంగా తన భూమి పట్టా ట్రాన్స్ ఫర్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగి వేదిస్తున్నాడని.. ఎంతగా వేడుకుంటున్నా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. ఐదు వేల రూపాయాలు ఇస్తే కాని పని కాదని చెబుతున్నట్లు ఎంపికీ గోడు విన్నవించుకున్నాడు రైతు. వెంటనే స్పందించిన ఎంపీ సదరు ఉద్యోగిని పిలిచి ప్రశ్నించాడు. ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో మరికొంత మంది రైతులు అక్కడికి వచ్చి తమ వద్ద కూడా భారీగా లంచాలు డిమాండ్ చేశారని ఆరోపించారు.
రైతు ఆవేదన చూసిన ఎంపీ చంద్రప్రకాశ్ జోష్ ఆ ఉద్యోగిని అందరి ముందు చెంప చెల్లుమనిపించాడు. ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తున్నప్పటికీ ఇలా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం ఎంత వరకు న్యాయం అని ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వ్యవహారం తన వద్దకు వస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి తోటి ఉద్యోగుల ముందు ఉద్యోగిపై చేయి చేసుకోవడం మంచి పద్దతి కాదని ఎంపీ పై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
चित्तौड़गढ़ से भाजपा सांसद चंद्र प्रकाश जोशी ने एक सरकारी कर्मचारी को सार्वजनिक रूप से थप्पड़ मार दिया। वीडियो सोशल मीडिया पर वायरल। pic.twitter.com/JdSLXjcsFB
— Priya singh (@priyarajputlive) November 3, 2022