భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు. నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్ లో తన కంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేశారు. ఆయనకు ఎందరో ఎన్నో బహుమతులు, ప్రశంలు ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. రతన్ టాటాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు.
భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు. నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్ లో తన కంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేశారు. కేవలం వ్యాపారం రంగంలోనే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందు ఉంటారు. తన వ్యాపారంలోని చాలా ఆస్తులను సమాజం కోసం విరాళంగా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి రతన్ టాటా. ఆయనకు ఎందరో ఎన్నో బహుమతులు, ప్రశంసలు ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా ప్రపంచ కుబేరుడు ఒకరు.. రతన్ టాటాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. మరి.. ఆ కుబేరుడు ఎవరు? రతన్ టాటాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుకుందాం..
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. రతన్ టాటాతో ముంబైలో మంగళవారం సమావేశమయ్యారు. బిల్ గేట్స్.. టాటా గ్రూప్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్తో కలిసి రతన్ టాటాతో సమావేశమయ్యారు. టాటా గ్రూప్ పెద్దలతో బిల్ గేట్స్ కీలక చర్చలు జరిపారు. టాటా గ్రూప్ వారితో ఆయన ఎక్కువగా దాతృత్వ కార్యక్రమాల గురించి చర్చలు జరిపారని, వారితో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఈ క్రమంలో బిల్ గేట్స్.. రతన్ టాటాకు తన దగ్గర ఉన్న విలువైన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారంట. అలానే చంద్రశేఖరన్ కి కూడా మరో పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ”హౌ టూ ప్రివెంట్ ది నెక్ట్స్ పాండమిక్”, ”హౌ టూ అవైడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్” అనే రెండు పుస్తకాలను వారిద్దరికి అందించినట్లు తెలిసింది. బిల్ గేట్స్, రతన్ టాటా ఇద్దరూ ప్రపంచంలోనే దాతృత్వ కార్యక్రమాల్లో చాలా ముందుంటారు. వారు తమ సేవ కార్యక్రమాలతో ఎందరో హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇలాంటి వ్యాపార దిగ్గజాలు సమావేశం కావడం అందరిలో ఆశ్చర్యానికి కలిగిస్తుంది. భారత పర్యటన కోసం బిల్ గేట్స్ ఇటీవల వచ్చి బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇదే క్రమంలో పలువు కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలతో సమావేశం అవుతున్నారు. బిల్ గేట్స్ తన భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, క్రికెటర్ సచిన్ తెందుల్కర్, దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, కేంద్ర మంత్రులు మన్సుఖ్ మండవీయ, రాజీవ్ చంద్రశేఖర్ వంటి వారిని కలిశారు. ఇందులో భాగంగా మంగళవారం.. రతన్ టాటాతో బిల్ గెట్స్ ముంబైలో సమావేశం అయ్యారు. రతన్ టాటాతో జరిగిన సమావేశం విజయవంతమైదంటూ గేట్స్ ఫౌండేషన్ ట్విట్టర్లో వెల్లడించింది. మరి.. బిల్ గేట్స్.. రతన్ టాటాకు ఇచ్చిన బహుమతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our co-chair & founder, @BillGates had an enriching discussion with @RNTata2000 & N. Chandrasekaran, about their philanthropic initiatives. We look forward to strengthening our work together & partnering for health, diagnostics, and nutrition. pic.twitter.com/Xqs1hooDyX
— Gates Foundation India (@BMGFIndia) March 1, 2023