ఈ మద్య వ్యాపారస్తులు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్లు విసరడం ప్రారంభించాయి. ఏపిలో ఇటీవల బాహుబలి థాలి చాలెంజ్ విసిరారు. ఇది తిన్నవారికి లక్ష బహుమతి ఇచ్చారు. ఇలాంటి చాలెంజ్ లు ఈ మద్య పలు జోట్ల జోరందుకున్నాయి. తాజాగా యూపీలోని మీరట్ లో ఓ స్వీట్ షాప్ లో సమోసా చాలెంజ్ విసిరాడు. వివరాల్లోకి వెళితే..
దేశంలో సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆలు, ఆనియన్, కార్న్ ఇలా రక రకాలుగా సమోసాలు దొరుకుతాయి. చాలా హూటల్లలో చాయితో పాటు సమోసా తప్పకుండా ఉంటుది. ఈ రెండు కాంబినేషన్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. యూపీలో ఓ వ్యాపారి 8 కేజీల పెద్ద సమోసా తయారు చేశారు. దీనికి బాహుబలి సమోసా అని పేరు పెట్టి అర్థగంటలో ఈ సమోసా తింటే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని.. అంతేకాదు బంపర్ ఆఫర్ గా రూ.51 వేలు బహుబతి ఇస్తానని ప్రకటించాడు.
ఈ బాహుబలి సమోసా తయారు చేయడానికి గంటన్నర సమయం పడుతుందని.. ఇందులో ఆలూ, బఠానీలతో పాటుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి తయారు చేసినట్లు యజమాని కౌశల్ తెలిపారు. ఈ చాలెంజ్ గెలిస్తే రూ.51 ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిపాడు. తర్వాత తాను పది కిలోల సమోసా కూడా తయారు చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు. కాకపోతే ఎనిమిది కిలోల సమోస ఇప్పటి వరకు ఎవరూ తినలేకపోయారని వాపోయాడు. దీనికి గురించి లోకల్ చానల్ లో కూడా ప్రచారం చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.