అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల దారుణాలు రోజు రోజుకు పీక్స్కు చేరుకుంటున్నాయి. ఇక ఆ దేశాన్ని ఆక్రమించుకున్న నాటి నుంచి వారి ఆగడాలు నానాటికి శృతిమించుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడే అక్కడి నుంచి పారిపోవటంతో పరిస్థితి తీవ్రతను మనం స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భయంతోనే ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల వైపు దీనంగా చూస్తున్నారు.
ఇక తాలిబన్ల ఆగడాలను భరించలేక ఇప్పటికే చాలా మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయం నుంచి పక్క దేశాలకు పరుగులు పెడుతుండటం విశేషం. తాజాగా వారి దారుణాలపై ఆ దేశ మాజీ జడ్జీ బాహాటంగానే చెప్నిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవాళ్లపై వారు వ్యవహరించే తీరు మరీ మూర్ఖంగా ఉందని, వారిని లోబరుచుకుని సెక్స్ బానిసలుగా తయారు చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. అలా చెప్పారో లేదో అప్పుడే ఘుంగుతినే మరో వార్త వారి అసలు నిజాన్ని తెలియచేస్తోంది.
తాజాగా ముస్కాన్ అనే మహిళ అఫ్ఘానిస్తాన్ నుంచి ఇండియాకు శరణార్ధిగా వచ్చింది. అక్కడ జరిగే తాలిబన్ల ఆగడాలు, వారి పైశాచిక ఆనందం గురుంచి పూసగుచ్చినట్లు వివరించింది. తాలిబన్లు అక్కడి మహిళలను సెక్స్ రాకెట్లాగే వ్యవహరిస్తారని తెలిపింది. ఇక పదేళ్ల బాలికలను పెళ్లి చేసుకుని శారీరక ఆనందాన్ని అనుభవిస్తారని, చనిపోయినా శవంతోనే శృంగారం చేస్తారంటూ సంచలన విషయాలు బయటపెట్టింది.