టీచర్ల వస్త్రధారణకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రకాల దుస్తుల మీద నిషేధం విధించింది. ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
గురువు.. విద్యార్థులు జ్ఞానాన్ని ఆర్జించడంలో సాయం చేస్తాడు. దేవుడు, గురువు ఎదురుగా ఉంటే.. ముందుగా గురువుకు దండం పెట్టాలి అంటారు. కారణం గురువు అందించిన జ్ఞానం వల్లనే మీకు దేవుడి దర్శనం అయ్యింది అని. మన సమాజంలో గురువుకు అంత గొప్ప స్థానం ఉంది. మరి విద్యార్థులకు మంచి, చెడు బోధించే గురువు.. అన్ని విషయాల్లో ఆ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. మాటలు, చేతలు, నడవడిక మాత్రమే కాక.. ధరించే దుస్తుల విషయంలో కూడా అలానే ఉండాలి. అయితే నేటి కాలంలో కొందరు టీచర్ల వేషధారణ కాస్త అసభ్యంగా ఉంటోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీచర్లకు సరికొల్ల డ్రెస్ కోడ్ తీసుకు వచ్చింది. టీచర్లు జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ ధరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే..
టీచర్లకు సరికొత్త డ్రెస్ కోడ్ విధిస్తూ.. అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ను ధరించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక టీచర్లు.. పార్టీలను గుర్తు చేసే దుస్తులు అస్సలు ధరించరాదని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులు ఎన్నో అంశాలు నేర్చుకుంటారని.. అలాంటి టీచర్లు.. ధరించే దుస్తులు కూడా ప్రజల్లో ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. అంతేకాక ఉపాధ్యాయులు ధరించే దుస్తులు కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతాయనే అంశం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వీటిని దృష్టిలో పెట్టుకుని డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ.. అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు మాట్లాడుతూ.. ‘‘పాఠశాల ఉపాధ్యాయులకు సూచించిన డ్రెస్ కోడ్కు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. స్కూల్ టీచర్ల డ్రెస్ కోడ్ గురించి స్పష్టత ఇవ్వడం కోసం నోటిఫికేషన్ను జారీ చేశాం. కొంతమంది ఉపాధ్యాయులు తమకు నచ్చిన వస్త్రాలను ధరించి పాఠశాల విధులకు హాజరవుతున్నట్లు మాకు తెలిసింది. ఇలా ధరించడం కొన్నిసార్లు ఆమోదయోగ్యంగా అనిపించదు. అందుకే డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అంతేకాక నిబంధనలు ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురుష ఉపాధ్యాయులు ఫార్మల్ షర్ట్, ప్యాంటులు ధరించాలని.. మహిళా టీచర్లు హుందాగా ఉండే సల్వార్ సూట్లు, చీరలు, సంప్రదాయ వస్త్రాలు ధరించి విధులుకు హాజరు అవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల వస్త్రాధారణ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపించకూడదన్నారు. టీచర్లు అన్ని వేళలా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. మరి అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
There are some misgivings regarding dress code prescribed for school teachers. I am sharing the notification for clarity. pic.twitter.com/m4k3sQW4t6
— Ranoj Pegu (@ranojpeguassam) May 20, 2023