తల్లిదండ్రుల తర్వాత నమస్కరించవలసింది గురువుకే. అక్కడి పాఠశాలలోని సార్లకు నిజంగా దణ్ణం పెట్టాలి. ఎందుకంటే పిల్లలను ఇంటినుండి తీసుకువచ్చి మరీ విద్యాబుద్దులు చెప్పుతున్నారు. ఎక్కడో చూద్దాం..
పొద్దున్నే నిద్రలేచి కొంతమంది పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట విని బుద్ధిగా తయారై అన్ని సర్ధుకుని బడికి వెళతారు. ఇంకొందరు స్కూల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ని చాలా సతాయిస్తుంటారు. పిల్లలను బడికి పంపించేందుకు తల్లి పొద్దున్నే లేచినప్పటి నుండి నానా తంటాలుపడి తయారుచేస్తుంది. చివరకు స్కూల్ టైం కాగానే కడుపునొప్పి అని.. కాలు నొప్పి అని సాకులు చెప్పి కొందరు పిల్లలు బడి మానేస్తుంటారు. కొందరు బడి డుమ్మాకొట్టి బయట తిరిగి బడి వదిలే సమయానికి ఇంటికి చేరుకుంటారు. తల్లిదండ్రులేమో పిల్లలు బడికి వెళ్లారని అనుకుంటారు. ఇలా పిల్లలు రకరకాలుగా మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయితే పిల్లలు బడికి డుమ్మా కొడుతున్నారని తెలిసి సార్లు మంచి ప్లాన్ ఆలోచించారు.
స్కూల్ డుమ్మా కొట్టేవారికి బ్యాండ్ ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు చక్కగా స్కూల్కి వెళుతున్నారు. ఆ బ్యాండ్ కథ ఏంటో చూద్దాం. పాలమూరు జిల్లా పెద్దదర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 83 మంది పిల్లలు చదువుతున్నారు. పేరెంట్స్ ఉదయాన్నే పొలం పనులకు వెళితే పిల్లలు బడి మానేసి ఇంటివద్దనే ఉంటూ.. సాయంత్రం తల్లిదండ్రులకు స్కూల్కి వెళుతున్నామని చెబుతున్నారట. బడి మానేసే పిల్లలను బడికి రప్పించేందుకు.. ఊరిలో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్తో కలిసి టీచర్స్ ఓ మార్గం ఆలోచించారు.
బడికి పోకపోతే బ్యాండ్ ఇంటికి వస్తుంది. కొంతమంది పిల్లలతో సార్ ఇంటికి వచ్చి డుమ్మా కొట్టిన పిల్లలను బ్యాండ్ వాయిస్తూ బడికి తీసుకెళతారు. ఇంకేముంది స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బడికి వెళతారు. బ్యాండ్ సౌండ్ చేసుకుంటూ బడికి తీసుకెళతారు. ఇలా బడి పిల్లల హాజరు మెరుగుపరుచుటకు పాఠశాలలోని టీచర్లు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. పిల్లలను తీసుకువచ్చి చదువు చెబుతున్నారు. పిల్లల జీవితాల్లో వెలుగు నింపే గురువులంటే వీరేమరి.. గురువుకు దణ్ణం పెట్టాలి అని అంటారు నిజంగా దణ్ణం పెట్టవలసిన గురువులే. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.