పని పట్ల నిబద్ధత కలిగి ఉన్న ఉద్యోగులు ఎప్పటికైనా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అనుభవజ్షులు చెప్పేమాట. విధి నిర్వహణలో ఆటు పోట్లు ఎదురైనా తట్టుకుని.. నిలబడి పనిచేసే వారు కొందరు అయితే కొంత మంది టైమ్ పాసుగా ఉద్యోగాలు చేస్తుంటారు.
పని పట్ల నిబద్ధత కలిగి ఉన్న ఉద్యోగులు ఎప్పటికైనా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అనుభవజ్ఞులు చెప్పేమాట. ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ బాయ్..నిబద్ధతను మెచ్చి ఓ యువతి మంచి ఉద్యోగం ఇప్పించిన సంగతి విదితమే. విధి నిర్వహణలో ఆటు పోట్లు ఎదురైనా తట్టుకుని.. నిలబడి పనిచేసే వారు కొందరు అయితే టైమ్ పాసుగా ఉద్యోగాలు చేస్తుంటారు కొంత మంది. ఉద్యోగం కావాలి, కుటుంబ పోషణకు అదే ఆధారంగా భావించే వాళ్లు.. చేసే ఏ పనైనా దైవంగా కొలిచి.. చిన్న తప్పు కూడా చేయకుండా జాగ్రత్త పడుతుంటారు. డ్యూటీ టైమ్ అయిపోయిందని మధ్యలో వర్క్ ఫినిష్ చేయకుండా వదిలి వెళ్లరు. కానీ ఫేమస్ సంస్థకు చెందిన పైలట్లు మాత్రం ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. వారిని గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.
ఈ ఘటన మన దేశంలోనే జరిగింది. లండన్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాన్ని మధ్యలోనే ఆపేసి పోయారు. తమ డ్యూటీ టైమ్ ఓవర్ అంటూ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన పెను సంచలనంగా మారింది. సుమారు ఆరుగంటల పాటు జైపూర్ విమానాశ్రయంలో నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. వీరందరినీ రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించారు. పైలట్స్ చర్యపై, ఎయిర్పోర్టు అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ నుండి వస్తున్న ప్రయాణీకుడొకరు ట్విట్టర్ లో తమ గోడను వెళ్లిబుచ్చుకున్నాడు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎటువంటి సహాయం అందించలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, జైపూర్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్లను కూడా ఆయన ట్యాగ్ చేశారు.
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణంగానే పైలెట్లు విమానాన్ని జైపూర్కు తరలించారని వెళ్లడించారు. అసలేమైందంటే.. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం మూడు అంతర్జాతీయ, రెండు దేశీయ విమానాలకు జైపూర్కు మళ్లించారు. వీటిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాలు, స్పైస్జెట్కు చెందిన రెండు, గల్ఫ్ స్ట్రీమ్కు చెందిన ఒక విమానం ఉన్నాయి. ఎయిర్ ఇండియా విమానం AI-112 లండన్ నుండి ఉదయం 6:00 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్కు మళ్లించారు. రెండో ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ నుంచి దుబాయ్కు దారి మళ్లించారు. గల్ఫ్ స్ట్రీమ్ విమానం ఢిల్లీ నుంచి బహ్రెయిన్ వెళ్తుండగా, స్పైస్ జెట్ విమానం ఒకటి పూణే నుంచి ఢిల్లీకి వెళ్తుండగా, మరొకటి గౌహతి నుంచి వస్తోంది..
Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK
— Adit (@ABritishIndian) June 25, 2023