ప్రపంచంపై కరోనా దాడి ప్రారంభించి దాదాపు రెండేళ్లు దాటింది. రూపాలు మర్చుకుంటూ.. వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహమ్మారి. కోవిడ్ దెబ్బకి అప్పటి నుంచి ప్రజలు ఆంక్షల మధ్యనే బతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో వచ్చిన వ్యాక్సిన్ తీసుకోవడంతో.. దాని ప్రభావం దాదాపు తగ్గిపోయింది. రోజు వారి కోవిడ్ కేసుల నమోదు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను ఈ నెల 31 నుంచి ఎత్తివేయనున్నట్లు సమాచారం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా అమలులో ఉండదని వెల్లడించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు, భౌతిక దూరం కొనసాగించాలని సూచించింది.
కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 24 మార్చి 2020లో కేంద్రం తొలిసారిగా గైడ్ లైన్స్ జారీ చేసింది. వైరస్ వ్యాప్తికి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గైడ్ లైన్స్ లో వివరించింది. ఇక అప్పటి నుంచి రూల్స్ ను సవరిస్తూ వస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా..”కరోనాను అరికట్టేందుకు గత కొన్ని నెలలుగా వివిధ అంశాల్లో మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కరోనా విషయంలో చాలా అవగాహన వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత సామర్థ్యాలను పెంచుకున్నాయి.ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.. కరోనా కట్టడి రూల్స్ అమలు చేయాల్సిన అవసరంలేదని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలను అమల్లో ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది” అని అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖలు రాశారు. కాగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రం.. మాస్క్లు, శానిటైజేషన్ కొనసాగించాలని సూచించింది. మరి.. తాజాగా కేంద్రం విడుదల చేసిన ఈ లేఖలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.