వరుస భూకంపాలు ఉత్తర భారతదేశాన్ని భయపెడుతున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ప్రపంచాన్ని ఇప్పుడు ప్రకృతి విలయాలు వెంటాడుతున్నాయి. మనిషిపై ప్రకృతి పగబట్టిందా అనే రీతిలో వరుస భూకంపాలు అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అనే తేడాల్లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సరం అతిపెద్ద భూకంపం టర్కీ, సిరియాలో సంభవించింది. ఈమధ్య భారత్, నేపాల్, ఇండోనేషియా, జపాన్ లాంటి ఆసియా దేశాల్లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి. మన దేశంలో ఉత్తరాదిన భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
ఉత్తరాదిన వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వీటి వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది. తాజాగా జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. బుధవారం ఉదయం 10.10 గంటలకు జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెప్పింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్టర్లో ఒక పోస్టు చేసింది. భూకంప కేంద్రం లోతు 10 కిలో మీటర్లు ఉందని ఆ పోస్టులో పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లుగా రిపోర్ట్స్ వెలువడకపోవడం గమనార్హం.
Earthquake of Magnitude:4.0, Occurred on 12-04-2023, 10:10:51 IST, Lat: 34.44 & Long: 73.60, Depth: 10 Km ,Location: Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/sdfVCTQbqF@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS pic.twitter.com/9kdSJyD6Nj
— National Center for Seismology (@NCS_Earthquake) April 12, 2023