మన భారత మహిళలు అంటే చాలా గౌరవంగా జీవిస్తారు. చీర కట్టుకుని నిండుగా కనిపిస్తారు. సాక్షాత్తు అమ్మవారే కనబడుతుంటారు. అయితే ఆపద వచ్చినప్పుడు అపరిచితులతో అయినా సరే అమ్మలానే ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో సిగ్గు అనేది ఉండదు. ప్రాణం ముఖ్యం అన్న ఆలోచనే వస్తుంది. ఒక మహిళ కూడా ఎవరో తెలియని వ్యక్తుల కోసం అందరూ చూస్తుండగా చీర విప్పి ఐదుగురి ప్రాణాలను కాపాడగలిగింది.
ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేసేందుకు కొంతమంది ముందుకు వెళ్తుంటారు. సహాయం చేయడానికి అందుబాటులో ఏది ఉన్నా ఉపయోగించుకుంటారు. ఒక మనిషి ప్రాణం కాపాడుతుందంటే ఒంటి మీద బట్ట కూడా విప్పే గొప్ప మనుషులు ఉన్నారు. చుట్టూ ఉన్న జనం చూస్తారన్న సిగ్గు ఏ మాత్రం పడకుండా ప్రాణాలు కాపాడడమే ముఖ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. అలా ఆలోచించి ఓ మహిళా తన చీరను విప్పి ఐదుగురి ప్రాణాలను కాపాడింది. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఐదుగురు జీవితాలను ఆమె చీరే కాపాడింది. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అక్కడ ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కేఆర్ కూడలి సమీప అండర్ పాస్ లో నీరు పొంగుకొచ్చింది.
అయితే ఈ నీటిలో ఆరుగురు చిక్కుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళా టెకీ భాను రేఖ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈమె మృతి చెందారు. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయినా ఆ మహిళ మిగతా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ఆరుగురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం తెలియగానే బీబీఎంపీ రక్షణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రక్షణ చర్యలు చేపట్టి ఐదుగురి ప్రాణాలను కాపాడింది. అయితే వీరు వచ్చేవరకూ వారి ప్రాణాలను ఓ మహిళ కాపాడింది. అటు వైపే వెళ్తున్న ఓ మహిళ (42) కేకలు వినిపించడంతో వారి దగ్గరకు వెళ్ళింది. అండర్ పాస్ లో నిండిన నీటిలోమునిగిన కారులో చిక్కుకున్న వారిని మీడియా ప్రతినిధి ఒకరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ తన వల్ల కావడం లేదు. వారిని రక్షించేందుకు తాడు అవసరమైంది. ఎవరైనా సహకరించండి అని ఆ మీడియా ప్రతినిధి కోరాడు. చుట్టూ ఉన్న జనం చూస్తున్నారే తప్ప అతనికి సహాయం చేయాలని ఎవరూ ప్రయత్నించడం లేదు. దీంతో అటువైపుగా వచ్చిన ఓ మహిళ తన చీరను విప్పి ఆ మీడియా ప్రతినిధికి అందించింది. అండర్ పాస్ కి ఉన్న ఇనుప ఊచలు ఆమె చీర కట్టడంతో.. అందరూ చీరను పట్టుకుని బయటకు వచ్చారు. మరో మహిళ తన చున్నీని ఆ మహిళకు ఇవ్వగా.. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చారు. అలా ఆ మహిళ చుట్టూ ఎవరైనా చూస్తారు, పరువు పోతుంది అని అనుకోకుండా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. మహిళ చూపించిన తెగువకు అందరూ అభినందించారు. మనసుండాలే గానీ మార్గం అదే వెతుక్కుంటూ వస్తుంది. ఆ క్షణంలో చీర విప్పి వారిని రక్షించాలన్న మనసు ఆమెకు ఉండడమే గొప్ప విషయం. అమ్మ మీకు వందనం. మరి పరువు కంటే ప్రాణాలే ముఖ్యం అని ముందుకొచ్చిన ఆ మహిళపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Death of a 22 year old Woman by Drowning, not in a River, not in a Lake but in Bangalore Underpass…!!
BJP and Cong are solely responsible for it.pic.twitter.com/cUiXn4l8jS
— Dr Ranjan (@AAPforNewIndia) May 21, 2023