ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు.
పూర్వకాలం నుండి మనిషి తన జీవితం మనుగడ సాగించడం కోసం పెంపుడు జంతువులపై ఆధారపడి ఉన్నాడు. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా సాగించేవారు. వ్యవసాయం చేసేందుకు, వేట కొనసాగించేందుకు జంతువులను మచ్చిక చేసుకునేవారు. ప్రస్తుత కాలంలో కూడా పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి, ఆవు, ఎద్దు, గేదెలు మొదలైనవి మనిషితో మమేకమై జీవిస్తున్నాయి. వ్యసాయరంగంలో పశుపోషణ కూడా చాలా ముఖ్యమైనది. వ్యవసాయంతోపాటు పశుపోషణ చేసేవారు చాలా అభివృద్ధి సాధించారు. బావుల దగ్గర, ఇళ్లలో పెంచుకునే జంతువులు తమ యజమానులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. కుక్క చాలా విశ్వాసం కల జంతువు. యజమానికి రక్షణగా నిలిచి దొంగలబారినుండి కాపాడుతుంది. ఆవు, గేదెలు పాలిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆర్థికంగా రైతులకు తోడ్పాటునందిస్తాయి. యజమానితో బాగా అటాచ్మెంట్ పెంచుకుని రక్షణగా ఉంటాయి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం ఎదరైతే రక్షించేందుకు ప్రయత్నం చేస్తాయి. అలాంటిదే కర్ణాటకలో ఓ రైతుపై చిరుత దాడి చేయగా ఆవు, కుక్క తన యజమానిని రక్షించాయి. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక దావణగెరె జిల్లాలోని చన్నగిరి నియోజకవర్గంలో ఉబ్రాణి హోబ్లి కొరటికెరో అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కరిహలప్ప అనే రైతు ఉన్నాడు. కరిహలప్ప ఆవును, కుక్కను ప్రాణంగా పెంచుకుంటున్నాడు. ఆవును ప్రేమతో గౌరి అని పిలుచుకుంటాడు. అతను ఓ రోజు పొలం పనులు చేస్తుండగా హఠాత్తుగా ఓ చిరుత రైతుపై దాడి చేసింది. అది చూసిన ఆవు తన యజమాని ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించింది. అతని పెంపుడు కుక్క కూడా సాయం చేసింది. చిరుతతో ఆవు చాలాసేపు పోరాడింది. కొమ్ములపై ఎత్తి చిరుతను నేలపై పడేసింది. చిరుతపై కుక్క, ఆవు రెండు పోరాడడంతో చిరుత పారిపోయింది. అలా జంతువులు తన యజమానిని కాపాడుకున్నాయి.
కాగా, రైతు మాట్లాడుతూ.. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లాడని, తాను పొలంలో పనులు చేస్తుండగా చిరుత దాడి చేసిందని తెలిపాడు. అది గమనించిన ఆవు చిరుతను కొమ్ములతో బలంగా పొడిచింది. చిరుతను కొమ్ములతో ఎత్తి కిందపడేసిందని తెలిపాడు. కుక్క చిరుతపై దాడి చేసి గాయపరిచిందని చెప్పాడు. చిరుత తనపై దాడి చేయగానే ప్రాణాలు పోతాయని భావించాను.. కానీ గౌరి నన్ను బతికించింది అని తెలిపాడు. అక్కడ ప్రాంతంలో చాలా కాలంగా చిరుతలు గ్రామాలపై దాడి చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఊర్లో కుక్కలపై, జంతువులపై చిరుతలు దాడిచేసి చంపుతున్నాయని తెలిపారు.తమపై కూడా దాడికి పాల్పడుతాయని భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు
మండిపడుతున్నారు.