తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు అధికారుల్లో ఆందోళన మొదలయింది. వీరిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: లవర్తో వీడియో కాల్.. లైవ్లో ఉరి డ్రామా.. పాపం విధి వక్రించి..
గత ఏడాది కూడా ఐదువేల మంది పెరోల్ పై వెళ్లారు. కరోనా వైరస్ విజృంభించడంతో పెద్దయెత్తున ఖైదీలకు పెరోల్ లభించింది. కాగా, ఒకటిన్నరేళ్లుగా పరారీలో ఉన్న మిగతావారి ఆచుకీ తెలిపిన వారికి బహుమానం ఇస్తామని దిల్లీ పోలీసులు ప్రకటించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తిహార్, మండోలి, రోహిణి జైళ్లలో 18,000 మంది ఖైదీలు అత్యంత భద్రత నడుమ ఉన్నారు. ఒక్క కరోనా కేసు కూడా లేదు.