ఘనంగా వివాహ వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు నవ్వులు విరబూసిన ఆ ఇంట ఆర్తనాధాలు ధ్వనించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో పెళ్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి 13 మంది మృతి చెందారు.
UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022
పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో 12 మంది బావిపై నుంచున్నారు. వారి బరువును ఆపలేక బావిపై ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. అందరూ బావిలో పడిపోయారు. మొదట 11 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వారు కూడా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మృతుల వివరాలు.. పూజ(19), శశికళ(15), శకుంతల(35), మమతా దేవి(35) మీర(25), పూజ(20), పరి(1), జ్యోతి(15), రాధిక(16), సుందరి(15), ఆర్తి(10), పప్పీ(20), మను(18)గా గుర్తించారు.
उत्तर प्रदेश के कुशीनगर में हुआ हादसा हृदयविदारक है। इसमें जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। इसके साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन हर संभव मदद में जुटा है।
— Narendra Modi (@narendramodi) February 17, 2022
ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది హృదయ విదారక ఘటనగా ప్రధాని అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.