పొలిటికల్ డెస్క్- రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడం సహజం. కానీ ప్రత్యర్ధులపై మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఇలా మాట మీరిన సందర్బాల్లో ఆ మాటను వెనక్కి తీసుకోవడమో, లేదా క్షమాపణలు చెప్పడమో చేస్తుంటారు పొలిటీషియన్స్. కానీ మహిళా నేతలపై మాట్లాడేటప్పుడు నోరు జారితే మాత్రం అది రచ్చ రచ్చ అవుతుంది.
ఇదిగో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి నోరు జారారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల, ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై నీరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది.. అని వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నీరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరంజన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయు. మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందంచారు. నీరంజన్ రెడ్డికి ధిటుగా ఆమె కౌంటర్ ఇచ్చారు.
ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల మంత్రి నీరంజన్ రెడ్డిని నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని, సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్లో చాలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అంతే కాదు కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని షర్మిల కామెంట్ చేశారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె అన్నారు.