క్రైం డెస్క్- కత్తి మహేష్ కారు ప్రమాదానకి సంబందించి సురేష్ చాలా విషయాలను పోలీసుల విచారణలో చెప్పాడు. కారు యాక్సిడెంట్ సమయంలో సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం, మనిషి కూడా హెవీగా ఉండటంతో బలంగా ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్ కూడా పగిలిపోయిందని సురేష్ పోలీలకు వివరించాడు. తాను రెండుసార్లు సీటు బెల్టు పెట్టుకోమని చెప్పినా కత్తి మహేశ్ వినిపించుకోలేదని సురేష్ చెప్పాడు. ఇక కారు ప్రమాదం అయిన వెంటనే తన వైపునున్న డోర్ ఓపెన్ కాలేదని, కత్తి మహేష్ వైపున ఉన్న డోర్ ఓపెన్ అయ్యిందని తెలిపాడు. అన్నా హాస్పటల్కి వెళ్దాం రండి అంటే ఆయనే కాలు కిందికి పెట్టాడని అన్నాడు సురేష్.
అప్పటికే హైవేపై ఉన్న పెట్రోలింగ్ పోలీసులు వచ్చారని చెప్పాడు. యాక్సిడెంట్ అయిన తరువాత, హాస్పటల్కి వెళ్లే వరకూ కూడా కత్తి మహేశ్ సృహలోనే ఉన్నారని, ఆయనతో పాటు తాను కూడా చెన్నై వెళ్లానని చెప్పుకొచ్చాడు. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నానని, కత్తి మహేష్ కోలుకున్నాక వెంటిలేటర్ కూడా తీసేశారని చెప్పాడు. కత్తి మహేష్ ఫ్రెండ్ పవిత్రతో పాటు తాను కూడా అక్కడే ఉన్నానని, ఐసీయూ నుంచి కిందికి షిఫ్ట్ చేసిన సమయంలో కత్తి మహేష్ చాలా బాగున్నాడని సురేష్ పోలీసులకు వివరించాడు.
ఐతే హాస్పటల్ కు తీసుకుని వెళ్లిన తరువాత కత్తి మహేశ్ కు లంగ్స్ ప్రాబ్లమ్ అని వైద్యులు చెప్పలేదని, కానీ చివరి రోజు లంగ్స్ ఇన్ఫెక్షన్తో చనిపోయారని చెప్పడంతో మేం అంతా షాక్ అయ్యామని పోలీసుల విచారణలో వివరంచాడు సురేష్. తనకు కత్తి మహేశ్ కు ఎలాంటి విభేదాలు లేవని, జరిగింది ఖచ్చితంగా ప్రమాదమేనని, అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పాడట సురేష్. మరి ఆస్పత్రిలో చికిత్సపై అనుమానాలుంటే ఆ కోణంలో విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.