ప్రస్తుత కాలంలో మరణాలు ఏ విధంగా వస్తున్నాయో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఎవరికీ ఏ రూపంలో మృత్యువు సంభవిస్తుందో అస్సలు చెప్పలేని పరిస్థితి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ప్రస్తుత కాలంలో మరణాలు ఏ విధంగా వస్తున్నాయో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఎవరికీ ఏ రూపంలో మృత్యువు సంభవిస్తుందో అస్సలు చెప్పలేని పరిస్థితి. ఇటీవలే కాలంలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు వారి కుంటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. కేవలం గుండె పోటు మాత్రమే కాదుమన ఆరోగ్య అలవాట్లు సరిగా లేకపోవడం వలన వివిధ రూపాల్లో మరణం సంభవిస్తుంది. ఇక తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలంలో తంబిగాని గ్రామంకి చెందిన రాణి అనారోగ్యంతో మరణించింది. గుండెపోటు తో మరణించిన ఈమెని స్మశానంలో పూడ్చడానికి ముగ్గురు వ్యక్తులు పాడే మోస్తున్నారు. అయితే అసలే విషాద ఛాయలు అలుముకున్న వాతావరణంలో మరొక ముగ్గురు చనిపోవడం తీవ్ర ఉద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. సరిగ్గా స్మశాన వాటిక దగ్గరకి వచ్చేసరికే పాడె కరెంట్ తీగలకే తగిలింది. దీంతో తిరుపతి, రవీంద్రన్, ముప్పలు అక్కడికక్కడే మృతి చెందారు.