మడగాస్కర్ ఈశాన్య తీరంలో సోమవారం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో మడగాస్కర్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డ మినిస్టర్ ఏకంగా 12 గంటల సాటే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఆ వివరాలు..
సోమవారం మడగాస్కర్ ఈశాన్య ప్రాంతంలో చోటు చేసుకున్న ఓడ ప్రమాదాన్ని పరిశీలించడానికిగాను దేశ పోలీసు రాష్ట్ర కార్యదర్శి సెర్జ్ గెల్లె (53), మరి కొంతమందితో కలిసి.. హెలికాప్టర్లో బయలు దేరారు. అయితే దురదృష్టవశాత్తు.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు. అయితే 18 మంది మృతదేహాలు మాత్రమే రిస్క్యూ టీం గుర్తించింది. ఈ ప్రమాదంలో మినిస్టర్తో పాటు మరో వ్యక్తి కూడా సజీవంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో! బ్రిగేడియర్ లిడ్డర్ పార్ధీవదేహాన్ని ముద్దాడిన భార్య..
ఈ క్రమంలో సదరు మినిస్టర్ గెల్లె ఏకధాటిగా 12 గంటల పాటు సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. గెల్లెతో పాటు మరో పోలీసు అధికారి మంగళవారం ఉదయం సముద్రతీర పట్టణమైన మహంబో ప్రాంతానికి ఒకరి తర్వాత ఒకరు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది.. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన మినిస్టర్ ని, మరో అధికారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సదరు మినిస్టర్ నాకు చావు అప్పుడే రాసి పెట్టులేదు.. అందుకే ప్రాణాలతో బయటపడగలిగాను అని తెలపాడు.
♦️Le GDI Serge GELLE, un des passagers de l’hélicoptère accidenté hier a été retrouvé sain et sauf ce matin du côté de Mahambo.
☑️ Les sapeurs sauveteurs de la #4°UPC ont également retrouvé le carcasse de l’hélicoptère au fond de la mer. pic.twitter.com/sP2abwTMwB— Ministère de la Défense Nationale Madagascar (@MDN_Madagascar) December 21, 2021
పడవ ప్రమాదంలో 19 మంది మృతి
ఈశాన్య మడగాస్కర్ తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం 19 మంది మరణించారు. 66 మంది గల్లంతయ్యారు. వారికి కోసం గాలిస్తున్నట్టు ఆ దేశ సముద్ర ఏజెన్సీ తెలిపింది. అయితే ప్రజా రవాణాకు అనుమతి లేని కార్గో షిప్ ఓడ ఇది. అయితే ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తున్నట్టు గుర్తించారు. ఇంజన్లోకి నీరు చేరినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సముద్రంలో ఆపరేషన్స్ డైరెక్టర్ మామీ రాండ్రియానావోనీ వెల్లడించారు. ప్రమాద సమయంలో ఓడలో సుమారు 150 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి కారణం తెలుస్తుందా?