చాలామంది తెలివైన విద్యార్ధులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొందరు కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రతిభ ఉండి ఆర్ధిక కారణాలతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్న విద్యార్ధులకు కొందరు సాయపడుతున్నారు. కొన్ని సంస్థల అయితే పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఉన్న విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఎంతో ప్రతిభ ఉండి ఉండి పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న విద్యార్దులకు ఎల్ఐసీ సంస్థ స్కాలర్ షి అందిస్తోంది. తన అనుబంధ విభాగం.. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. “విద్యాధన్ స్కాలర్షిప్” పేరుతో పేద పిల్లలకు స్కాలర్షిప్స్ అందిస్తోంది. అయితే ఈ స్కాలర్ షిప్ కి సంబంధించిన అర్హతులు, ఇతర వివరలు తమ వెబ్ సైట్ పొందుపరిచింది.ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాధన్ స్కాలర్ షిప్ కు ఇంటర్ మొదటి సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తొలి ఏడాది చదువుతున్న విద్యార్ధులు అర్హులు. అయితే అభ్యర్ధులు తమ ముందు తరగతిలో కచ్చితంగా 60శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.6 లక్షలకు మించకుండా ఉండాలి.
చివరగా ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్ధులకు వారి వారి విద్యాస్థాయిని బట్టి స్కాలర్ షిప్ అందుతుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు. అదే డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున మూడేళ్లు అందజేస్తారు. ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున రెండేళ్లు అందజేస్తారు.పైన తెలిపిన అర్హత, ఆసక్తిగ విద్యార్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకి చివరి తేది సెప్టెంబర్ 30. అప్లయ్ చేయడానికి పూర్తి వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.