భార్యభర్తలు బంధం అంటే ఆర్టీసీ బస్సు ప్రయాణంలాంటిది. భర్త డ్రైవర్ అయితే.. భార్య కండక్టర్. ఇద్దరి సమన్వయంతో సాగిస్తే వారి ప్రయాణం సుఖంగా సాగుతుంది. అయితే నిజంగానే ఓ జంట ఆర్టీసీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త డ్రైవర్ గాను, భార్య కండక్టర్ గాను విధులు నిర్వహిస్తున్నారు. ఇకా ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇద్దరు ఒకే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అందుకే వీరి డ్యూటీ చేస్తున్న బస్సులో ఒక్కసారైన ఎక్కాలని ప్రయాణీకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ బస్సంటే అక్కడి ప్రయాణికులకు ఎంతో ఇష్టం. కాస్త లేటైనా సరే, అదే బస్సు వచ్చే వరకూ ఆగి.. అందులోనే ప్రయాణిస్తారు. ప్రస్తుతం ఆ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు వాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కేరళ లోని అలప్పుజ్హ జిల్లాకు చెందిన గిరి గోపీనాథ్, తార భార్యభర్తలు కలిసి ప్రస్తుతం కేఎస్ ఆర్టీసీలోని ఒకే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంచెం వీళ్ల ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. గిరి గోపీనాథ్, తార ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా దాదాపు 20 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు వీరి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిని ఎదిరించి ఎట్టకేలకు లాక్ డౌన్ కాలంలో 2020లో పెళ్ళి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. 2007లో గోపీనాథ్, 2010 తారకి ఆర్టీసీ లో ఉద్యోగం వచ్చింది.
దీంతో ఇద్దరు కలిసి ఒకే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకోసం వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ కూడా కోరారు. అనుమతి లభించడంతో బస్సు పై సొంత పెట్టుబడి పెట్టి, గిరి బస్సుకు డ్రైవర్ గా పని చేస్తుండగా అతని భార్య తార కండక్టర్ గా చేస్తోంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ బస్సును ఆ జంట కలర్ ఫుల్ గా డెకరేట్ చేసింది. అంతేకాకుండా ఆ బస్సు లోపల మ్యూజిక్ సిస్టమ్, ఆరు సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్ లు, ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెష్ ఇలా అబ్బో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.
బస్సులో ఎక్కి ప్రయాణిస్తున్నామన్న అనుభూతి కంటే ఏదో పిక్నిక్కి వెళుతున్నామనే అనుభూతి ప్రయాణికులకు కలిగేలా చేస్తున్నారు. గిరి, తార తమ సొంత డబ్బు ఖర్చు చేసి ఈ బస్సును ఇలా అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇద్దరూ హరిపాడు డిపోలో పనిచేస్తున్నారు. అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ కేరళ జంట. వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇదీ చదవండి: Pushpa Srivani: వెండితెరపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి..!
ఇదీ చదవండి: మీసం లేకపోతే బతకలేనంటున్న మహిళ! ఎవరు ఈమె?