ఇప్పుడు అమ్మాయిలకు పెళ్లి అంటే అంచనాలు హై లెవల్లో ఉన్నాయి. ఎలాంటి వరుడు కావాలని ప్రశ్నిస్తే.. మందుగా లక్షలు సంపాదించేవాడు, కోటీశ్వరుడు, అత్తమామలు లేని కొడుకు, ఆడ పడుచులు లేని అబ్బాయి దీనికి తోడు అందగాడు కావాలంటూ కోరికల చిట్టాను తీస్తున్నారు.
లోకం పోకడ రోజు రోజుకూ మారిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలకు పెళ్లి అంటే అంచనాలు హై లెవల్లో ఉన్నాయి. ఎలాంటి వరుడు కావాలని ప్రశ్నిస్తే.. మందుగా లక్షలు సంపాదించేవాడు, కోటీశ్వరుడు, అత్తమామలు లేని కొడుకు, ఆడ పడుచులు లేని అబ్బాయి దీనికి తోడు అందగాడు కావాలంటూ కోరికల చిట్టాను తీస్తున్నారు. ఇప్పటి వరకు భార్యలు ఇలా ఉండాలి అని కండిషన్లు పెట్టేవారు అబ్బాయిలు. పెద్దలు బలవంతంగా పెళ్లిళ్లు చేసినా.. భార్య అందంగా లేదని, పళ్లు ఎత్తు అని, తన హైట్ తగ్గట్లుగా లేదని, శరీర కొలతలు దగ్గర నుండి ప్రతిది లెక్కగట్టి.. పిల్లులు పుట్టిన తర్వాత అయినా వదిలేసేవారు. దీంతో నిస్సహాయత స్థితిలో ఉండిపోయేది భార్య. కానీ ఇప్పుడు అమ్మాయిల హవా నడుస్తుంది కాబట్టి.. తాము ఊహించిన విధంగా ఉండాలని అనుకుంటున్నారు. కాదని పెళ్లి చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది.
నల్లగా ఉన్నాడని భార్య తనను రోజుకొక నరకం చూపిస్తుండటంతో.. వాటిని తట్టుకోలేక భర్త కోర్టు మెట్లెక్కిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అయితే భర్తను వేధించడం కూడా క్రూరత్వం కిందకు వస్తుందని గుర్తించి కోర్టు.. అతడికి విడాకులు మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. వీరికి ఓ అమ్మాయి పుట్టింది. 2012లో విడాకులు కావాలని బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనను నల్లగా ఉన్నానని భార్య తరచూ హింసించేదని, అవమానించేదని పేర్కొంటూ విడాకులు మంజూరు చేయాలని పేర్కొన్నాడు. తనను భార్య హేళన చేసినా.. తన కుమార్తె కోసం ఆ బాధలన్నీ పడ్డట్లు కోర్టు ముందు చెప్పుకున్నాడు. అయితే సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది.
కాగా, భార్య కుటుంబ న్యాయస్థానంలో ఆరోపణలను ఖండించింది. భర్త మరియు అతని కుటుంబ సభ్యులే తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనను హింసిస్తున్నారని పేర్కొంది. తనను వరకట్నం డిమాండ్ చేశారని, తన బిడ్డతో బయటకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించింది. అంతే కాకుండా తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ పేర్కొంది. దీంతో2017లో ఫ్యామిలీ కోర్టు భర్త వేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు ఆమె చేసే ఆరోపణలు నిరాధారమైనవని గ్రహించి.. నల్లగా ఉన్నాడని భర్తను వేధించడంది క్రూరత్వం కిందకు వస్తుందని పేర్కొంది. ఆమెకు భర్తతో కాపురం చేసే ఉద్దేశం లేదని గ్రహించిన న్యాయమూర్తులు అలోక్ ఆరాధే, అనంత్ రామనాథ్ హెగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్..హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(ఐ)(ఏ) ప్రకారం విడాకులు మంజూరు చేసింది.