ఫ్లాష్ ఫ్లాష్ : ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్లపాటు అందించిన న్యూస్ ఆపరేషన్స్ను నిలిపివేసినట్టు ప్రకటించింది. మిగిలిన సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఆగస్టు 26 (నేటి)నుంచి యాహూ ఇండియా ఎటువంటి కంటెంట్ పబ్లిష్ చేయదని యాహూ ఎక్కౌంట్తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ తెలిపింది. ఈ పరిణామంతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్కు సంబంధించిన కంటెంట్ ఆగిపోతుంది. ఎఫ్డీఐ కొత్త నిబంధనలు, విదేశీ మీడియా కంపెనీలపై భారతదేశ నియంత్రమ చట్టాల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాహూ స్పష్టం చేసింది.
డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకూ మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని, అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే అనుమతించాల్సిన పరిస్థితి. కొత్త నిబంధనలు అక్టోబర్ నుంచి అమల్లో రానున్నాయి. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్ లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని యాహూ వెల్లడించింది.
తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది. యాహూ తాజా నిర్ణయానికి భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.