యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్ దాడి కలకలం రేపింది. డ్రోన్ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలాయి. మరోచోట అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తానీ యువకుడు మృతిచెందారు.
#BREAKING: Yemen based Iran-backed Houthis launch drone attack on three oil tankers in the UAE. Explosions took place at Abu Dhabi industrial area and fire at the airport as well. Massive escalation. More details are awaited.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 17, 2022
అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణస్థలంలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు తెలియజేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. చిన్న విమానానికి చెందిన భాగాలు కూడా లభించినట్లు తెలియజేశారు. పేలుడు, అగ్నిప్రమాదం రెండూ డ్రోన్ దాడిలో భాగంగానే జరిగినట్లు భావిస్తున్నారు.
మరోవైపు ఈ దాడి తమ పనే అంటూ ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు యూఏఈలోని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. వారి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#UPDATE Abu Dhabi fire | Two Indian nationals killed. Their identities being ascertained: Indian envoy to UAE Sunjay Sudhir confirms to ANI
— ANI (@ANI) January 17, 2022