అతడి కడుపులో దాదాపు 36 ఏళ్ల పాటు ఓ మనిషి జీవించాడు. తన కడుపులో ఓ మనిషి ఉన్నాడని తెలియగానే అతడితో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా షాక్కు గురయ్యారు.
అతడి పేరు సంజు భగత్. నాగ్పూర్కు చెందిన అతడి జీవితం 19 ఏళ్లు వచ్చే వరకు అందరు యువకుల్లానే ఉండింది. అయితే, ఎప్పుడైతే 20 ఏళ్లు పడ్డాయో అప్పుటినుంచి కష్టాలు మొదలయ్యాయి. 19 ఏళ్ల వరకు సాధారణంగా ఉన్న అతడి కడుపు రోజురోజుకు ఉబ్బసాగింది. కొన్ని నెలలకే గర్భం వచ్చినట్లుగా మారిపోయింది. దీంతో అతడ్ని అందరూ ‘ గర్భవతి సంజు’ అని గేలి చేస్తూ పిలిచేవారు. మొదట్లో తన పొట్ట గురించి అతడు పట్టించుకోలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతడిలో కొత్త సమస్యలు మొదలవ్వసాగాయి. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో 36 ఏళ్ల తర్వాత అతడు వైద్యులను సంప్రదించాడు.
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతడి కడుపులో ట్యూమర్ ఉందని భావించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ తీయటానికి సన్నాహాలు చేశారు. అయితే, ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. అతడి కడుపులో ఉన్నది ట్యూమర్ కాదని, ఓ మనిషి అని తెలిసి నోరెళ్ల బెట్టారు. దీనిపై సంజుకు ఆపరేషన్ చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. ‘‘ అతడి కడుపులో చాలా ఎముకలు ఉన్నాయి. మొదట ఓ కాలు బయటకు వచ్చింది. తర్వాత మరో కాలు. తర్వాత ఒక్కో భాగం బయటకు వచ్చాయి.
మేము భయపడిపోయాము. లోపల ఓ మనిషి ఉన్నాడని తెలిసి బిక్కచచ్చిపోయాను. అది నన్ను షాక్కు గురి చేసింది. ఇలా ఓ వ్యక్తి కడుపులో మరో వ్యక్తి పెరగటాన్ని ‘పీటస్ ఇన్ పీటు’ అంటారు. ఇదో అత్యంత అరుదైన కండీషన్. బయటకు తీసేటప్పుడే కడుపులోని బాగాలు కోసేయాల్ని వచ్చింది ’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, సంజు తన కడుపులోంచి బయటకు తీసిన తన ట్విన్ను చూడటానికి ఇష్టపడలేదు. బయటకు తీసిన అవయవాలను పడేశారు. సంజు తన పాత రోజుల్ని మరిచిపోయి సంతోషంగా జీవిస్తున్నాడు. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.