ఏ దేశంలోనైనా ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు.. ప్రపంచ దేశాలు చెయ్యి అందించాలి. అది మానవత్వం. లేదా సహాయం చేస్తున్న చేతులకైనా అండగా నిలబడాలి అది మంచితనం. ఈ రెండూ మా దేశానికి లేవని మరోసారి నిరూపించుకుంది పాకిస్థాన్. భూకంపాలతో అల్లాడిపోతున్న టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తాలు అందించాల్సిందిపోయి.. సహాయం చేస్తున్న చేతులకు అడ్డుతగలాలని చూసింది. టర్కీ, సిరియా ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆ దేశాలకు సాయం అందించడానికి బయలు దేరిన భారత యుద్ధ విమానాలకు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది.
భారీ భూకంపాలతో టర్కీ, సిరియాలు అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. వారి బాధను చూసిన భారత్.. వెంటనే భారీ సాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగానే భారీ రెస్క్యూ టీంతో పాటుగా.. మెడికల్, పారామెడికల్ సిబ్బందితో పాటుగా 100 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని టర్కీకి తరలించడానికి పూనుకుంది. ఈ క్రమంలోనే సహాయక సామాగ్రితో పాటుగా రెండు యుద్ద విమానాలను సిద్ధం చేసింది. అయితే పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ ను అనుమతి కోరగా.. అందుకు పాక్ అంగీకరించలేదని సమాచారం.
దాంతో పాక్ చుట్టూ తిరుగుతూ.. టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది భారత యుద్ధ విమానం సీ-17. అదే పాక్ దానికి ఒప్పుకుని ఉంటే.. ఘజియాబాద్ నుంచి పాక్, ఆప్ఘాన్, ఇరాన్ మీదుగా టర్కీ చేరుకునేది. దాంతో కొన్ని ప్రాణాలు అయిన దక్కేవి అని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత యుద్ధ విమానాలు పాక్ గగనతలం మీద నుంచి వెళ్లలేదని, ఇందుకు సంబంధించిన ఎలాంటి అనుమతులను కూడా భారత్, పాక్ ను అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అదీకాక భారత్ లోని టర్కీ రాయబారి ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye.
Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023