సాధారణంగా కవలలు అంటే ఒకే పోలికతో ఉంటారు. వారిని గుర్తించడం చాలా కష్టం.. ఇలా కవలల పిల్లలకు సంబంధించి బోలేడు ఆశ్చర్యకరమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. సరే దాని గురించి కాసేపు పక్కన పెడితే.. కవలలు అంటే వారికి తల్లితండ్రి ఒక్కరే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త చాలా అరుదైనది అంటున్నారు వైద్యులు. ఇంతకు విషయం ఏంటంటే.. ఓ 19 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు అనుకోని డౌట్ వచ్చింది. దాంతో పిల్లలకు డీఎన్ఏ పరీక్ష చేయించింది. దానిలో షాకింగ్ విషయం వెల్లడయ్యింది. కవలల డీఎన్ఏ వేర్వేరుగా ఉంది. ఇది ఎలా సాధ్యం అని డాక్టర్లు ఆశ్చర్యపోగా.. సదరు యువతి అసలు విషయం చెప్పింది. తాను ఒకే రోజు ఇద్దరు యువకులతో శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం డాక్టర్లు ఇద్దరు యువకులకు డీఎన్ఏ టెస్ట్ చేయగా.. కవలల చిన్నారులతో సరిపోయాయట. ఆ వివరాలు..
ఈ వింత సంఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఓ యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఎనిమిది నెలల వయసు వచ్చాక ఆమెకు పిల్లలకు తండ్రి ఎవరా అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే.. గర్భం దాల్చడానికి ముందు సదరు యువతి ఇద్దరు యువకులతో శారీరంగా కలిసింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఒకరిని తన కవల పిల్లలకు తండ్రిగా భావించి.. అతడికి డీఎన్ఏ పరీక్ష చేయించింది. అయితే ఆశ్చర్యంగా ఒక్క చిన్నారి డీఎన్ఏతో మాత్రమే సరిపోయింది.
ఈ రిజల్ట్ చూసి వైద్యులతో పాటు సదరు యువతి కూడా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అసలు విషయం డాక్టర్లకు చెప్పింది. తాను అదే రోజు మరో యువకుడితో శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రెండో యువకుడికి డీఎన్ఏ పరీక్ష చేయించగా.. మరో చిన్నారికి అతడే తండ్రిగా తెలిసింది.ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన సంఘటన. 10 లక్షల కుసుల్లో ఒక్కటి మాత్రమే ఇలా జరుగుతుంది అని తెలిపారు.
‘‘ఇలాంటి పరిస్థితులను శాస్త్రీయంగా హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారు. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసినప్పుడు.. సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు.. పురుషుల వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుంది. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలు వేర్వేరు మావి(ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయి. మనుషుల్లో ఇది అత్యంత అరుదైన సంఘటనే కానీ.. జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమే’’ అని వెల్లడించారు. మరి ఈ అరుదైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.