జై, శర్వానంద్, అంజలి, అనన్య నటించిన జర్నీ సినిమా గుర్తుంది కదా! అందులో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీ కొంటాయి. ఈ సీన్ ఇప్పటికీ అందరికి కళ్లముందే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ముఖాముఖి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 87 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ సెనెగల్లో చోటు చేసుకుంది.
సెనెగల్, కాఫ్రైన్ ప్రాంతంలోని గ్నివి గ్రామంలో తెల్లవారుజామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ దేశ అధ్యక్షుడు మాకీ సాల్ తెలిపారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందగా, మరో 87 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆయన, బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఓ బస్సు టైరు పంక్చర్ అయి మరో బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్లు సరిగా లేకపోవడం, డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల పశ్చిమ ఆఫ్రికాలో ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే తరహాలో 2017లో రెండు బస్సులు ప్రమాదానికి గురై 25 మంది చనిపోయినట్లు వారు వెల్లడించారు. ఈ విషాదకర ఘటనలో మరణించిన వారికి మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Suite au grave accident de ce jour à Gniby ayant causé 40 morts, j’ai décidé d’un deuil national de 3 jours à compter du 9 janvier. Un conseil interministériel se tiendra à la même date pour la prise de mesures fermes sur la sécurité routière et le transport public des voyageurs.
— Macky Sall (@Macky_Sall) January 8, 2023
🇸🇳 FLASH | Au moins 38 morts et 87 blessés après une collision entre deux bus au #Sénégal. L’accident a eu lieu dans la ville de #Kaffrine, à environ 250 km au sud-est de la capitale Dakar.
— Cerfia (@CerfiaFR) January 8, 2023