కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లుహంలో 200 మందితో బయలుదేరిన అతి పెద్ద పడవ ఒక్కసారిగా నీట మునిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏకంగా 145 మంది జలసమాధి కాగా.. మిగత 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మంగళవారం లూలూంగా నదిలో దాదాపు 200 మందితో పడవలో రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు బయలు దేరింది. అయితే పడవలో ప్రయాణికులతో పాటు పశువుల అతి పెద్ద సామాన్లు వేసుకుని బయలు దేరారు.
ఇక వీరు ప్రయాణిస్తున్న పడవ బసన్ కుసు పట్టణానికి చేరుకోగానే ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా 145 మంది క్షణాల్లో నీటమునిగి జలసమాధి కాగా, 55 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై వెంటనే స్పందించిన అక్కడి అధికారులు కొంతమందిని ప్రాణాలతో రక్షించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై అధికారులు స్పందించారు. పడవ సామార్ధ్యానికి మించి బరువును ఉంచడం వల్లే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి పడవ ప్రమాద ఘటనలు గతంలో చాలానే జరిగాయని అధికారులు తెలిపారు. ఈ పడవ ప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.