గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి బాంబు దాడులు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల పాఠశాలల్లో వరుస బాంబుపేలుళ్లతో ఉలిక్కిపడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు మరో భీకర బాంబు దాడి ఘటనతో భయకంపితులవుతున్నారు. ఈ ఘటన మరువక ముందే.. కుందుజ్ ప్రావిన్స్ లో బాంబుల మోత మోగింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలో కొంతమంది మిలిటెంట్లు అమాయ ప్రజలపై దారుణంగా దాడులు చేశారు. ఈ ఘటనలో 33 మంది చనిపోగా మరో 43 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు.
దారుణం ఏంటంటే మృతి చెందిన వారిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అయిన ముజాహిద్ తెలిపారు. ఇటీవల ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని.. ఇది ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇది అతిపెద్ద దాడి అని అన్నారు. ఇది ముమ్మాటికి ఐసిస్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.