ఎక్కడికైనా మనం పయనిస్తున్నామంటే ముందుగా అన్ని సర్ధి పెట్టుకుంటాం. ఇక రైలులో కొన్ని గంటల పాటు ప్రయాణించాల్సి వస్తే.. వాటర్ బాటిల్స్, తినే ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటుంటారు పెద్దలు. ఎందుకంటే రైలులో ఏదీ కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది
ఎక్కడికైనా మనం పయనిస్తున్నామంటే ముందుగా అన్ని సర్ధి పెట్టుకుంటాం. ఇక రైలులో కొన్ని గంటల పాటు ప్రయాణించాల్సి వస్తే.. వాటర్ బాటిల్స్, తినే ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటుంటారు పెద్దలు. ఎందుకంటే రైలులో ఏదీ కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది ఒకటైతే.. నాణ్యత లేని ఆహారం లభిస్తుంది. వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో వస్తువులపై ఉన్న ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న మార్పులు ఏమీ చోటుచేసుకోవడం లేదు. ఇక రైళ్లలో ఆహారం తీసుకుందామన్న కూడా ధర ప్రభావం కారణంగా ఆర్డర్ చేయలేకపోతున్నారు. అయితే ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేస్తుంది ‘ఐఆర్సీటీసీ’.
జనరల్ కోచ్లో ప్రయాణించే ప్రయాణీకులకు అందుబాటు ధరల్లో, మంచి ఆహారాన్ని అందించేందుకు రైల్వే ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అదే రైల్వేస్ జనతా ఖానా. జనరల్ కోచ్ల ప్రయాణికులకు జనతా ఖానా సరఫరాను వేగవంతం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న డివిజనల్ యూనిట్లను బోర్డు ఆదేశించింది. చౌకగా మంచి భోజనం అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ విధానాన్ని రైల్వే బోర్డు తీసుకువచ్చింది. ఈ సర్వీసును ప్రస్తుతం ‘నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్’లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు చేపడుతున్నారు. ఈ ఫుడ్ రెండు కేటగిరీలతో అందించనుంది.
ఇక మోనూ చూస్తే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పదార్ధాలతో రూపొందించింది. మొదటి మెనూలో 7 పూరీలు (175 గ్రాములు), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రా), ఊరగాయ (12 గ్రా) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక వాటర్ బాటిల్ అయితే రూ. 3 రూపాయలే (200 మి.లీ). ఇదే కనుక అమల్లోకి వస్తే.. చాలా మంది రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారేమో చూడాలి. ఇలాంటి ధరల్లో ఎటువంటి ఆహార పదార్థాలను అందించాలని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.